29, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురుభక్తి ప్రాశస్త్యం


"వేదాంత దేశికులు, తమ గురువుని భగవంతుడి కన్నా అధికంగా భావించేవారు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడినది - ఈశ్వరుడు కనుక ఆగ్రహిస్తే, గురువు రక్షించగలుగుతాడు, కానీ గురువే ఆగ్రహిస్తే త్రిమూర్తులలో ఎవరూ రక్షించడానికి ముందుకు రారు. మనం సంపూర్ణ అంకిత భావముతో, విశ్వాసముతో, ఎటువంటి భేషజములు లేకుండా గురువు వద్ద శరణాగతి చేస్తే, గురువే మనల్ని దుఃఖముల నుండి రక్షించి, మోక్షమార్గం చూపిస్తాడు. కానీ ఈ రోజులలో గురుభక్తి కొరవడడం వలన ఈశ్వరుని యందు భక్తి కూడా జనుల హృదయాలలో తగ్గిపోతోంది".

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి