30, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతీ


"మనందరమూ జీవితములో జ్ఞానం సంపాదించడానికి తపన పడాలి. ఒక్క జ్ఞానముతో మాత్రమే మనము ఎటువంటి కష్టాలనైనా, బాధలనైనా ఓర్చుకుని సహించగలము.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, మానవ జన్మ ఎత్తినందుకు, ప్రతీ ఒక్కరికీ సుఖాలతో పాటు, కష్టాలు కూడా జీవితములో ఉండి తీరుతాయి. బాగా ఐశ్వర్యం కలిగిన వాడో లేక పదవులలో బాగా ఉన్నత స్థానం చేరుకున్నవారినో చూసి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాము, వారు ఎంత సుఖపడుతున్నారో, వాళ్ళకి అసలు కష్టాలే లేవు అని. అలా అనుకుని, మనం కూడా జీవితములో చాలా సమయాన్ని ఈ ధనము/కీర్తి/పదవుల వేటలోనే వెచ్చిస్తున్నాము. యథార్ధంగా, అటువంటి ఐశ్వర్యవంతులను, లేదా పెద్దపెద్ద పదవులలో ఉన్నవారిని అడిగితే, వాళ్లకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తాయి.

నిజానికి, ప్రతీ మనిషీ తనకున్న కష్టమే అందరి కష్టం కన్నా పెద్దది అనుకుంటూ ఉంటాడు, కాబట్టే, ఒక కష్టం రాగానే, ఇతరుల నుంచి సానుభూతి కోరుకుంటూ ఉంటాడు. అసలు మనం పుడుతూనే, మనం ఈ జన్మలో ఏ ఏ కష్టాలు అనుభవించాలో, మన పూర్వ కర్మానుసారం, నిర్ధారితమై పుట్టాము. అంటే, ప్రతీ ఒక్కరికీ కష్టములు తప్పవు. అయితే, ఈ కష్టాలను తట్టుకోగలగడం అనేది, కేవలం జ్ఞానం పొందడం వల్ల మాత్రమే సాధ్యము".

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి !!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి