25, మే 2013, శనివారం

శ్రీ పరమాచార్య వాణి - సత్కర్మాచరణ ఆవకశ్యత

"ఒక రాగి పాత్రను ఒక పది సంవత్సరాల పాటు ఒక బావినీటిలో పడవేసి ఉంచారనుకోండి, ఆ తర్వాత ఎంత సేపు దానిని చింతపండుతో రుద్దితే, ఆ పాత్రకి పట్టిన కిలుం వదిలిపోతుంది? రాగి పాత్రని మనం ఎంతగా రుద్ది శుభ్రం చేస్తే, అది అంతలా మెరుస్తుంది. అదే విధముగా మన మనసు కూడా ఎన్నో సంవత్సరాలపాటు చెడు (పాప) కర్మలను చేయడం వలన, చెడు మాట్లాడడం వలన మలినం అయిపోయింది. మన మనసు మళ్ళీ పవిత్రం అవ్వాలంటే, ఎన్నో మంచి పనులను, సత్కార్యాలను చేస్తూ ఉండడం వల్ల, ఆ చెడ్డ కర్మల వల్ల కలిగిన మాలిన్యం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది".

శ్రీపరమాచార్య స్వామి వారి పై బోధకి సంబంధించి, పూజ్య గురువు గారి వాక్కుల ద్వారా నేను తెలుసుకున్న మరి కొంత వివరణ....


ఇక్కడ మంచిపనులు  అంటే, ఏ కర్మలను/పనులను వేదం ఒక వ్యక్తికి 

విహిత కర్మలుగా గుర్తించినదో ఆ కర్మలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం, ఏ కర్మలను చేయవద్దు అని నిషిద్ధ కర్మలుగా వేదం చెప్పినదో, వాటిని చేయకుండా ఉండడం. విహిత కర్మాచరణ చేస్తూ ఉండడం, నిషిద్ధ కర్మల జోలికి కూడా వెళ్లకుండా ఉండడం, గురువులను, పెద్దలను సేవించడము, గురువు గారి అనుమతి/సూచనల మేరకు మాత్రమే దానములు/లోకోపకార పనులు చేయడము, సత్సాంగత్యము నెరపడము.
మంచి పనులు చేయమన్నారు కదా... ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్లకి మన ఇచ్చ వచ్చినట్లు దానాలు చేసేస్తే "నువ్వు పాడైపోతావు" అని శాస్త్రం చెప్పినది. అందుకే, మనం ఒక మంచి పని అనుకుని, ఆ పని చేసేముందు, గురువుల/పెద్దల అనుమతితో చేయడం మంచిది అని పూజ్య గురువు గారి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి