27, మే 2013, సోమవారం

శ్రీ పరమాచార్య వాణి # పాపపుణ్యముల విచారణపై అర్జునుడికి శ్రీకృష్ణ సందేశం


"మహాభారత యుద్ధం చేయడానికి ముందు, "బంధు మిత్రులను యుద్ధంలో సంహరించి, రాజ్యాన్ని పొందడం పాపం కాదా?" అని అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మని అడుగుతాడు. ఈ ప్రశ్నకి సమాధానం గీతలోనే శ్రీకృష్ణపరమాత్మ చెప్పి ఉన్నారు. ఇక్కడ సాంరాంశం ఏమిటంటే, మన కంటికి 'క్రూరము' గా లేక 'చెడు' గా కనిపించినవన్నీ పాపభూయిష్టమైన కర్మలు కానవసరం లేదు. బాహ్యంలో ఇతరులకు నొప్పి కలిగించినట్టుగా కనబడిన ఒక చర్య, మొత్తం లోకానికి మేలు చేకూర్చగలిగితే అది పాపం కాదు.
ఇలా అయితే ఒక సందేహం కలుగవచ్చు. మరి ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పాపం కానిది లేదా పుణ్యమో ఎలా నిర్ధారించేది? గీతలోనే కృష్ణ పరమాత్మ దీనికి సమాధానం చెప్పారు.
"కామముతో మరియు ద్వేషముతో ప్రేరేపింపబడిన చేష్టితములు పాపముగానూ" - "కామము మరియు ద్వేషము అనేవి లేకుండా, కేవలం లోకక్షేమాన్ని ఉద్దేశించి చేసే పనులు పుణ్యములుగానూ, అటువంటి లోకక్షేమకారక కార్యములలో కొన్ని, బాహ్యంలో క్రూరముగా కనిపించినా అవి పాపముగా పరిగణింపబడవు" అని గీతాచార్యుడి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి